*ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు*
*మణుగూరులో చుక్కల నుంటుతున్న కూరగాయల ధరలను అదుపు చేయాలి*
*నకిలీ నిత్యవసర వస్తువుల పై నిఘా పెట్టాలి*
*మణుగూరు తహశీల్దార్ వి. రాఘవ రెడ్డి
ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు
మణుగూరులో చుక్కల నుంటుతున్న కూరగాయల ధరలను అదుపు చేయాలి నకిలీపై నిఘా పెట్టాలని కోరుతూ మణుగూరు తహశీల్దార్ వి. రాఘవ రెడ్డి కి గురువారం నాడు వినతి పత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నె బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మణుగూరులో కూరగాయల అధిక ధరలు మధ్యతరగతి నిరుపేదలకు అందుబాటులో లేవని ఆంధ్రాలో ఏ ప్రాంతం ముంపునకు గురైనా ఆ సాకుతో మణుగూరులో కూరగాయలు రేట్లు అమాంతం పెంచేస్తున్నారని.కూరగాయల వ్యాపారులు సిండికేట్ గా మారి వారానికి రెండు సార్లు పాటల కొట్టని మరొకటని అధిక రేట్లకు అమ్మి వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. దళారులు సంఘటితంగా రైతులను మార్కెట్లో నేరుగా అమ్మనీయని పరిస్థితని మణుగూరు అధిక రేట్ల కూరగాయలపై పూర్తిస్థాయి అధ్యనయం చేసి వినియోగదారులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా నకిలీ టీ పొడి నకిలీ పాలు మరియు నిత్యవసర వస్తువులలో అనేకం నకిలీ అయ్యాయని కొంతమంది వ్యాపారుల స్వార్థానికి ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల భారీ వర్షాలు మణుగూరును ముంచెత్తిన సమయంలో ఎమ్మెల్యే ని కలెక్టర్ ని ఇతర అధికారులను సిబ్బందిని స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకొని ప్రజలకు ఆయన అందించిన అండదండలు మా మణుగూరుకు మంచి చేసే తహశీల్దార్ వచ్చారని సంతోష పడుతున్నారని ప్రశంసించారు. సామాజిక కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ భూముల సంరక్షణ తోపాటు అనేక అంశాలలో మణుగూరు పై వి. రాఘవ రెడ్డి మార్కు ప్రత్యక్షంగా కనబడుతున్నదన్నారు. దయచేసి తమ విన్నపాన్ని మన్నించి కూరగాయల అధిక రేట్లను నకిలీ టీ పొడి మరియు ఇతర నిత్యవసర వస్తువుల తోపాటు ప్రవేట్ స్కూల్లో అధిక ఫీజులు ప్రైవేట్ వైద్యం పై కూడా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని ఆకస్మిక తనిఖీలు నిర్వహించటం లేదా కూరగాయల వ్యాపారులను, ఇతర వ్యాపారులను పిలిపించి మాట్లాడి ప్రజలకు న్యాయం చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఎమ్మార్వో సానుకూలంగా స్పందించినట్లు కర్నే బాబురావు తెలిపారు.