IASలు వారానికి రెండు పాఠశాలలు సందర్శించాలి: రేవంత్*
TG: రాష్ట్రంలో విద్యావ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు.
జిల్లాల్లోని IAS అధికారులు వారానికి 2 పాఠశాలలను సందర్శించాలని విద్యాశాఖ సమీక్షలో సూచించారు. ఈ ఏడాది పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు నిర్మించాలని చెప్పారు. మధ్యాహ్న భోజనం తయారీకి సోలార్ కిచెన్ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. టెన్త్ పాసైన విద్యార్థులు కచ్చితంగా ఇంటర్లో చేరేలా చూడాలని తెలిపారు.