ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జానే..?
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా.?
మేడ్చల్ జిల్లా ప్రతినిధి / ఉప్పల్
జనవరి 11
బోడుప్పల్ 13వ డివిజన్ సర్వే నంబర్ 63/1 మల్లన్న గుడి నుండి మాణిక్చంద్ చౌరస్తా పోయె ప్రధాన రహదారి హెచ్ పి పెట్రోల్ బంక్ వెనుకాల నాన్ వెజ్ మార్కెటకు ఆనుకొని కోట్ల విలువగల ప్రభుత్వ భూమి ఓ ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో కబ్జా అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు ప్రజ ప్రయోజనాల కోసం ప్రభుత్వం,అధికారులు పనిచేస్తారనే మాట కంటి చూపు మేరలో కనిపించడం లేదు.రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో . అధికారం ఏ పార్టీ ఉంటే ఆ నేతలకు వంత పాడడమే ప్రభుత్వ అధికారుల విధిగా మారినట్లు స్పష్టమవుతున్నది.
ప్రభుత్వ భూములను ఆసరాగా చేసుకొని పట్టా భూములను కొనుగోలు చేసి రియల్ వ్యాపారం సాగిస్తున్నారు. మరికొంత మంది వ్యాపారులు అధికారులను ప్రభావితం చేసే రాజకీయ నేతల అండదండలతో ఏకంగా ప్రభుత్వ భూములను కొనుగోలు చేస్తున్నారు.అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి పట్టా భూములుగా మార్చుకుంటున్నారు.
నేడు అదే అధికారులు ఏ పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు