అన్నం బాలేదంటే కళ్లలో కారం కొట్టారు’.. బాలికల కన్నీళ్లు

అన్నం బాలేదంటే కళ్లలో కారం కొట్టారు’.. బాలికల కన్నీళ్లు  ..

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని పాలమాకులే గురుకుల పాఠశాల బాలికలు హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంచి నీటి సమస్య కూడా ఉందని.. ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. హాస్టల్ సిబ్బంది తమ కళ్లలో కారం కొట్టారని వెక్కివెక్కి ఏడ్చారు. టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అవుతారంటూ భయపెడుతున్నారన్నారు. సీఎం వచ్చి సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

Share News