కేసముద్రం లో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి పట్టివేత…

*కేసముద్రం లో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి పట్టివేత…*

*వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య..*

ఉదయం *కేసముద్రం ఎస్ఐ మురళీదర్* తన సిబ్బందితో *కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ* చేయుచుండగా, అనుమానాస్పదంగా ఒక తెల్లని ఎర్టిగా ( TS07UP 0754)కారులో *పఠాన్ అస్లాం ఖాన్* s/o ఆశ్రఫ్ ఖాన్ 28 yr, ముస్లిం, ఆటో డ్రైవర్ r/o నూజివీడు, *వెదుల ప్రదీప్ కుమార్* తండ్రి, శ్రీనివాస మూర్తి, 32yr, బ్రాహ్మణ, క్యాబ్ డ్రైవర్ r/o చల్లపల్లి, వైజాగ్ అను వారు అక్రమంగా వైజాగ్ దగ్గర గల సీలేరు నుండి ఎండు గంజాయిని వాహనంలో తీసుకు వస్తూ పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని *5 కిలోల గంజాయిని* ( విలువ రూ. 125000 /-), *కారును, రెండు మొబైల్ ఫోన్ లను సీజ్ చేయడం జరిగింది.* వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ..కేసు విషయంలో *మహబూబాబాద్ రూరల్ సిఐ పి సర్వయ్య, కేసముద్రం ఎస్ఐ మురళీధర్, సిబ్బంది రాజు, రామకృష్ణ, మహేందర్,వెంకన్న, మధు* లను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ అభినందించారు.

Join WhatsApp

Join Now