ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ జి .నందకిషోర్,జోనల్ సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ టి .సేవకుమార్ “

రాష్ట్ర
Headlines in Telugu:
  1. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ గార్లపాటి నందకిషోర్ ఏకగ్రీవ ఎన్నిక
  2. జోనల్ సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ టి సేవకుమార్ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు
  3. 2024-25 ఐఎంఏ నాయకత్వ బాధ్యతలు గుంటూరు బ్రాంచ్ వైద్యులకు
  4. ఐఎంఏ 66వ రాష్ట్ర సదస్సులో కొత్త నాయకత్వం ప్రమాణ స్వీకారం
  5. ఆంధ్రప్రదేశ్ వైద్యుల సమస్యల పరిష్కారంలో నందకిషోర్ ప్రాధాన్యం

2024 -25 సంవత్సరానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా గుంటూరు ఐఎంఏ బ్రాంచ్ కి చెందిన డాక్టర్ గార్లపాటి నందకిషోర్,జోనల్ సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ టి సేవకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్ వై .సుబ్బారాయుడు, డాక్టర్ బి.సాయికృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ప్రస్తుత బాపట్ల జిల్లా చీరాలలో గార్లపాటి శరాబంది,వసంత లక్ష్మి దంపతులకు జన్మించిన డాక్టర్ నందకిషోర్ , సిద్ధార్థ,గుంటూరు మెడికల్ కళాశాలలో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశారు. 

విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో చెవి ముక్కు గొంతు వైద్య విభాగంలోఎం.ఎస్ పూర్తి చేశారు. అనంతరం అపోలో, దక్కన్,కాటూరి వైద్య కళాశాలలో అధ్యాపకులుగా వివిధ హోదాలలోపనిచేశారు. 

ఐఎంఏలో బ్రాంచ్ స్థాయి నుండి క్రియాశీలక సభ్యునిగా పేరుపొందిన ఆయన రాష్ట్రస్థాయిలో సంయుక్త కార్యదర్శిగా , ఉపాధ్యక్షులుగా,రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు.           

ఐఎంఏ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కూడా ఆయన ఆయా పదవులలో ఉన్నప్పుడే వైద్యుల సమస్యల పరిష్కారంలో తనదైన పాత్ర పోషించారు. జోనల్ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ టి. సేవకుమార్ తాతా నాగేంద్రరావు, కనకదుర్గ దంపతులకు బాపట్లలో జన్మించారు. 

బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన ఆయన,గుంటూరు వైద్య కళాశాలలో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశారు.1996లో బ్రాడీపేటలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ స్థాపించి అతి తక్కువ ఖర్చుకి వైద్య సేవలు అందిస్తున్నారు. 

గుంటూరు ఐఎంఏ బ్రాంచ్ లో క్రియాశీలకంగా ఎదిగిన డాక్టర్ సేవకుమార్, ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులుగా, నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా సేవలందిస్తున్నారు.    

వీరు ఇరువురు ఈనెల 23వ తేదీన గుంటూరులో జరుగుతున్న మూడు రోజుల 66వ ఐఎంఏ రాష్ట్ర సదస్సులో ప్రమాణ స్వీకారం చేస్తారని డాక్టర్ సుబ్బారాయుడు,డాక్టర్ సాయి కృష్ణ తెలిపారు.

డాక్టర్ వై .సుబ్బారాయుడు అధ్యక్షులు,డాక్టర్ బి. సాయికృష్ణ, కార్యదర్శి

ఐఎంఏ గుంటూరు శాఖ.

Join WhatsApp

Join Now