సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి. ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ..
నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి జనవరి09
సంక్రాంతి పండుగ సెలవులకు ఇంటికి తాళం వేసి వెళ్లే వారు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధు శర్మ సూచించారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ సూచనలను ఆమె ప్రజలను కోరారు.ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకుండా బ్యాంక్ లాకర్ లో భద్రపరచుకోవాలన్నారు.
ఊరెళ్తున్నామన్నా విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయొద్దన్నారు.
డోర్స్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టం వాడితే మంచిదన్నారు.
గ్రామాలలోని ప్రజలు సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని ఆమె సూచించారు .
సి.సి కెమెరాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటు పర్యవేక్షించాలని అన్నారు.అపరిచిత వ్యక్తులు వస్తే వారి సమాచారం సంబంధిత పోలీసులకు వెంటనే అందించాలన్నారు..
శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం రెక్కీ నిర్వహించి , రాత్రి వేళ చోరీలకు పాల్పడుతుంటారని, వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు.ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని ముందుగానే చెప్పాలన్నారు..
పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిదన్నారు.
ఇంట్లొ కుటుంబ సభ్యులు ఊరికి వెళ్తే మహిళలు, వృద్ధులు “అపరిచితులు” సమాచారం పేరుతో వస్తే నమ్మ వద్దన్నారు.
కాలనీల వారిగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలని ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ సూచించారు.
తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించి పోలీస్ శాఖకు సహకరించాలన్నారు..దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలని ఆమె కోరారు..ఎప్పటికప్పుడు సమాచారం అందించేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని, డయల్ 100 ను కాల్ చేసి సద్వినియోగం చేసుకోవాలన్నారు.