సుందరయ్య స్ఫూర్తితో రాబోయే రోజుల్లో యువతి యువకులు మన హక్కులకై పోరాటానికి సిద్ధం కావాలి
40వ సుందరయ్య వర్ధంతి సభలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి ప్రజలకు పిలుపు
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 19( ప్రశ్న ఆయుధ ం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు
కొమరాడ మండల కేంద్రంలోనూ మరియు కుమ్మరకుంట పంచాయతీ డంగ భద్ర గ్రామంలో దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు పార్టీ నిర్మాత మరియు తొలి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు మరియు పోరాట,ఉద్యమం నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సభ ఘనంగా జరిగింది ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేస్తూ జోహార్ కామ్రేడ్ సుందరయ్య అంటూ నినాదాలు ఇస్తూ, నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు పార్టీ నిర్మాత తొలి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన పుచ్చలపల్లి సుందరయ్య యొక్క 40 వ వర్ధంతి సభ జరుపుకోవడం జరుగుతుందని దీనికి సంబంధించి సుందరయ్య గారు 1/5/ 19 13వ సంవత్సరంలో జన్మించి 19/ 5/ 1985 వ సంవత్సరంలో మరణించారు సుందరయ్య గారు ఒక ధనిక కుటుంబంలో పుట్టి కమ్యూనిటీ పార్టీ కోసం పేద ప్రజల అభివృద్ధి కోసం తాను అన్ని వదులుకొని కడవరకు జీవించిన వ్యక్తి సుందరయ్య గారు అలాగే కూలి రేట్లు కోసం తమ కుటుంబంతో గొడవ పడి బయటికి వచ్చిన వ్యక్తి సుందరయ్య ఇలాంటి సందర్భంలో సుందరయ్య తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు అయినా అన్ని పార్టీల ముఖ్య మంత్రులు మరియు ఎమ్మెల్యే నుండి ఎంపీలు నుండి మంచి పేరు తెచ్చుకోవడంతోపాటు ప్రతిపక్ష నాయకుడిగా సైకిల్ పైన పార్లమెంట్ కి వెళ్లే సందర్భంలో ఆయన యొక్క స్ఫూర్తి అందరికీ ఆదర్శమని ఆయన యొక్క శైలి అందరికీ ఆమోదంగా ఉండే పరిస్థితి ఉండేదని కాబట్టి ఇలాంటి సందర్భంలో మన హక్కులను కాలరాసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పైన భవిష్యత్తులో జరిగే పోరాటంలో యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసే విధంగా ముందుకు రావాలని అప్పుడే సుందరయ్య కి ఇచ్చిన నిజమైన ఘన నివాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుచున్నాము ఈ కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు