దగాపడ్డ దళితుల మేల్కొలుపు యాత్ర బంగారు చలక లో

ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 3 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ కులాలు హక్కులు కోల్పోయి అనాధల్లా బ్రతకొద్దు పోరాడి సాధించుకుందాం అన్నారు.

లక్ష్మీదేవి పల్లి మండలం బంగారుచిలక గ్రామంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దగాపడ్డ దళితుల మేల్కొలుపు యాత్ర బంగారుచలక దళితవాడలో బుధవారం జరిగింది.ఈ యాత్రలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సగం భూభాగం వెనకబడ్డ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడ్డది ఎస్సీ కులాలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ,ఎస్టీలకు ఒకే విధమైన అభివృద్ధి చేయాలని డిపాండ్ చేశారు.ఎస్సీ కులాల స్థానిక రిజర్వేషన్ ఉద్యోగ ఉపాధి రాజకీయంగానే కాక,నివాసం ఉంటున్న ఇంటిపై సాగు చేస్తున్న భూమిపై హక్కులు కల్పించాలని ప్రజా పాలన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏజెన్సీ ప్రాంతం పేరుతో ఎస్సీ కులాలను అభివృద్ధికి దూరం చేస్తున్నా ప్రభుత్వాలపై పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు.షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి పాత బంగారు చెలక గ్రామ కమిటీ కన్వీనర్ గా మల్లిపెద్ది అజయ్,కే చిరంజీవి,సహాయ కన్వీనర్ జి ప్రవీణ్, గౌరవ సలహాదారులు గుంటమల్ల కన్నయ్య,వీరస్వామి, రాములు బాబు, 11 మందితో కమిటీ ఏర్పడింది.కొత్త బంగారుచేలక గ్రామ కమిటీ కన్వీనర్ మహంకాళి చిన్న ముత్తయ్య,కో కన్వీనర్ ఈదుల కన్నయ్య,సహాయ కన్వీనర్ వల్లూరి శ్రీను గౌరవ సలహాదారులుగా ఈదుల తిరుపతయ్య,దార శ్రీనివాసరావు, మహంకాళి ముత్తయ్య 9 మందితో కమిటీ ఏర్పడింది. కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకులు గోడ్ల మోహన్ రావు, కండె రాములు, సలిగంటి కొమరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now