దేశ భవిష్యత్తుఉపాధ్యాయుల చేతుల్లోనే 

దేశ భవిష్యత్తుఉపాధ్యాయుల చేతుల్లోనే

కామారెడ్డి (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 6:

“దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. అంకితభావంతో విధులను నిర్వర్తించి ఉత్తమ పౌరులను తయారు చేయాలి” అని కామారెడ్డి ఎంఈఓ ఎల్లయ్య అన్నారు.

రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషన్ బిల్డర్స్ అవార్డ్స్–2025 కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఈఓ ఎల్లయ్య, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ — ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు ఎన్నో ఆశలతో చదువుకుంటున్నారని, వారి ఆకాంక్షలు నెరవేరేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేసి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 16 మంది ఉపాధ్యాయులకు నేషన్ బిల్డర్స్ అవార్డులు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలు రోటరీ క్లబ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు శంకర్, ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణహరి, కోశాధికారి పర్ష వెంకటరమణ, ప్రాజెక్టు చైర్మన్ శ్రీశైలం, రొటేరియన్లు నాగభూషణం, డాక్టర్ గీరెడ్డి రవీందర్ రెడ్డి, సుధాకర్, సంతోష్, ధనుంజయ్, కాశీనాథం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now