సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవ..
-పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ ప్రశ్న ఆయుధం
అక్టోబర్ 23:
దేవరకొండ పట్టణ పరిధిలోని ముత్యాలమ్మ కాలనిలో ఏర్పాటు చేసిన పట్టణ ఫారెస్ట్ కార్యాలయం నుంచి పర్వతాలు చెరువు వరకు నిర్మించే సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై,సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అనంతరం ఎమ్మెల్యే ని వార్డు కౌన్సిలర్ భూదేవి సైదులు శాలువాతో సత్కరించారు.గత పాలకులు వార్డులలో ఎటువంటి అభివృద్ధికి తోడ్పడలేదని తన దృష్టికి రావడంతో కాలనీవాసుల సమస్యలు తీర్చడం కోసం సిసి రోడ్డు పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు.దేవరకొండ మున్సిపల్ పరిధిలోని పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదుల నిర్వహణ, త్రాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత గురించి సిబ్బందినీ అడిగి తెలుసుకొన్ని ,పాఠశాలలోని,సదుపాయాల,చెత్త,మరుగుదొడ్ల,నిర్వహణ,సిజనల్ జ్వరాలు, తీసుకోవలసిన జాగ్రత్తల ఫై గురించి, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్ని,విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే
శ్రీ నేనావత్ బాలు నాయక్
సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ పరిసర పరిశుభ్రతపాటించాలన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం గురుకులలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా,వైస్ చైర్మన్ ఎండి రహాత్ అలీ,దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మాజి ఎంపీపీ జాని యాదవ్,వార్డు కౌన్సిలర్లు భూదేవి సైదులు, డి సి శ్రీను,కాంగ్రెస్ పార్టీ నాయకులు శిరంథాష్ కృష్ణయ్య,యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొర్ర రాంసింగ్ నాయక్, పీ.ఏ.సీ ఏస్. చైర్మన్ కొండ్ర శ్రీశైలం యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పగడిమరి రఘురాములు, కౌన్సిలర్ జయ ప్రకాష్, ఉమామహేశ్వర్,యువజన విభాగ నాయకులు బాబురామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.