ఎమ్మెల్యేలు కూనంనేని,రాందాస్ టాప్ గేర్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీసింగ్ సెంటర్ ప్రారంభం

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 22 భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్ సి
అత్యాధునిక పరికరాలతో, అన్ని రకాల సౌకర్యాలతో
నూతనంగా టాప్ గేర్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీసింగ్ సెంటర్ ను
కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరియు వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
కొత్తగూడెం లాంటి పారిశ్రామిక ప్రాంతంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ లేని విధంగా, అత్యాధునిక పరికరాలతో, అన్ని సౌకర్యాలతో, అన్ని హంగులతో
విశాలమైన ప్రాంగణంలోఇద్దరు నవ యువకులు
మద్దెల ఆదర్శ్ మరియు జాటోత్ భరత్ లు ఎన్నో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి,అందరికీ అందుబాటులో ఉండే విధంగా , పట్టణానికి అతి సమీపంలో, ఈ అద్భుతమైన టాప్ గేర్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీసింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, వారికి సహకరించిన వీరు నాయక్ పాత్ర ప్రశంసనీయమని,కారు యజమానులందరూ ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,
కష్టపడితే ఎప్పటికైనా దానికి తగ్గ ఫలితం వస్తుందని
ఈ యజమానులు ఇద్దరు కష్టపడి, ఈ టాప్ గేర్ కార్ సర్వీసింగ్ సెంటర్ అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని, కొత్తగూడెం శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు మరియు వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయకులు ఉద్ఘాటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సభా ధ్యక్షత వహించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ , ఈనాడు యువకులంతా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా, ఉద్యోగాలు లేకపోయినా స్వయం శక్తితో ఉపాధి కల్పించుకొని అభివృద్ధిలోకి రావాలని,ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి,ఈ కారు సర్వీసింగ్ సెంటర్ ఏర్పాటుచేసిన మద్దెల ఆదర్శ్ మరియు జాటోత్ భరతులను యువకులంతా స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం వారు ఇరువురు సర్వీసింగ్ సెంటర్ అంతా తిరిగి అచ్చ ఆధునిక పరికరాలను ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి అభినందించారు.ఈ సందర్భంగా వచ్చిన అతిథులందరినీ కవి సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ శాలువాలతో సత్కరించి అభినందించారు
అనంతరం అందరికీ స్వీట్లను పంచిపెట్టారు కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కాపు సీతాలక్ష్మి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ మతి బదావత్ శాంతి, సిపిఐ జిల్లా పార్టీ సెక్రటరీ ఎస్కే సాబీర్ పాషా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగ సీతారాములు ,టాప్ గేర్ కార్ సర్వీసింగ్ సెంటర్ యజమానులు మద్దెల ఆదర్శ్ మరియు జాటోత్ భరత్, వారికి వెన్నెముకగా నిలిచిన వీరు నాయక్, ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి, సర్పంచ్ రాజా, సిపిఐ పార్టీ నాయకులు సలిగంటి శ్రీనివాస్, ఈ టాప్ గేర్ సర్వీసింగ్ సెంటర్ బిల్డింగ్ అధినేత బాదావత్ రాము, జాటోత్ లక్ష్మణ్,
రిటైర్డ్ సింగరేణి జిఎం అందేలా ఆనందరావు,
పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు చుంచుపల్లి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం రవి కుమార్, జూలూరుపాడు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ , సినీ నటులు చిత్రపురి సొసైటీ కార్యదర్శి తాండూర్ ధనరాజ్ ,స్వర సంగీత విద్వాన్ కలవల రామదాసు , అపరబాలు అల్లి శంకర్ జూలూరుపాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు లేళ్ల వెంకటరెడ్డి, కాంగ్రెస్ జిల్లా పార్టీ నాయకులు అంతోటి పాల్, బోడ గణేష్, గుగులోత్ కృష్ణ, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్, ప్రధాన కార్యదర్శి కొప్పరి నవతన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now