*ఇండియన్ ఆర్మీకి సెల్యూట్… ఫహల్గాం ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ దీటైనస్పందనకు శ్రీకారం చుట్టింది*
*ఆపరేషన్ సింధూర్ తో దాయాది దేశానికి వార్నింగ్*
*దేశ సత్తా చాటిన సైనిక దళాలకు, పీఎం మోడీ దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు*
*ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల జిల్లావ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో బిజెపి శ్రేణుల ప్రత్యేక పూజలు, ప్రార్థనలు*
*బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి*
*ఇల్లందకుంట మే 7 ప్రశ్న ఆయుధం*
ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ దీటైన స్పందన కు శ్రీకారం చుట్టిందని , పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై” ఆపరేషన్ సిందూర్” పేరుతో మెరుపు దాడులు చేసి , దేశ సత్తా చాటిన ఇండియన్ ఆర్మీకి, ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వానికి బిజెపి కరీంనగర్ జిల్లా పక్షాన సెల్యూట్ చేస్తున్నామని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడులు ప్రారంభించిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిజెపి శ్రేణులు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక, పూజలు ప్రార్థనలు నిర్వహించారు.. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఇల్లందకుంట శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారతీయుల రక్తం మరిగిపోయిందన్నారు. ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని, మన నేలపై దాడి చేస్తే , శాంతికి విఘాతం కలిగిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో దాయాది దేశానికి , ఉగ్రముకలకుతెలిసి వచ్చేలా ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన మెరుపు దాడుల తో సమాధానం చెప్పిందన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరిట చేపట్టిన మెరుపు దాడులు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా జరిగాయని పాకిస్తాన్, పిఓకే లోడింగ్ 9 ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడి చేసి ధ్వంసం చేశాయని తెలిపారు. ప్రధానంగా జెష్ మహమ్మద్, లష్కరే తోబియా, హిజ్పుల్ ఉక్రముకల పీచమని చేయాలా, ఆయా సంస్థల హెడ్ క్వార్టర్స్ పై భారత సైన్యం విరుచుకుపడి , మెరుపు దాడులు చేసిందని తెలిపారు. పాక్ రాడార్లకు దొరకకుండా, కేవలం టెర్రర్ క్యాంపు లను టార్గెట్ చేసి దాడులు నిర్వహించిందని పేర్కొన్నారు. పాక్ ఆర్మీ, సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా , ఖచ్చితమైన ఉగ్రవాదుల శిబిరాల టార్గెట్లతో అర్ధరాత్రి 1.28 గంటలకు మొదలైన ఆపరేషన్ సిందూర్ 9 చోట్ల జరిపిన దాడుల్లో వందమంది టెర్రరిస్టులు హతమయ్యారని తెలిపారు. న్యాయం గెలిచిందని , ఉగ్రవాదులకు , పాకిస్తాన్ కు, ప్రపంచానికి భారత సత్తా ఏంటో తెలిసి వచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్ కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని, సోషల్ మీడియా వేదికగా మేరా భారత్ మహాన్, జైహింద్ అని మద్దతు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు మాజీ సర్పంచ్ శ్రీలత సురేందర్ రెడ్డి, ఆకుల రాజేందర్, సంపత్ రావు, రాంబాబు, ఎండి షఫీ కొక్కుల దేవేందర్, విజయ్ బాబు, సమ్మయ్య, దుర్గయ్య, సాయిరెడ్డి, చుక్కల్ రెడ్డి, గోపాల్, రమేష్ సతీష్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకుడు వివిధ గ్రామాల బూతు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు