పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను చేపట్టిన భారత్‌.. 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను చేపట్టిన భారత్‌..

పాక్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది.

ఈ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది దేశం..

భారత్‌పై దాడులకు విఫలయత్నం చేస్తోంది. పాక్‌ దాడులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థలనూ ధ్వంసం చేశాయి. ఈ పరిణామాల నడుమ పాక్‌ పార్లమెంటులో ఓ సభ్యుడు (విశ్రాంత సైనికాధికారి) చేసిన వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తమ దేశాన్ని కాపాడాలంటూ దేవుడిని వేడుకుంటున్నట్లు అందులో కనిపిస్తోంది.

‘‘మన దేశం బలహీనంగా ఉంది. అందుకే ఈ దేశాన్ని కాపాడాలంటూ మనమంతా ఆ దేవుడిని ప్రార్థిద్దాం’’ అంటూ ఎంపీ, విశ్రాంత సైనికాధికారి మేజర్‌ తాహిర్‌ ఇక్బాల్‌ పార్లమెంటు వేదికగా విజ్ఞప్తి చేశారు. ‘‘మేం నిస్సహాయ స్థితిలో ఉన్నాం. నీ దయ ఉంటే మేం విజయం సాధిస్తాం. ఈ దేశాన్ని రక్షించు. శత్రువును ఓడించే బలాన్ని ఇవ్వు’’ అంటూ ప్రార్థించారు. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భారత్‌ నుంచి వరుస పరాభవాలు ఎదురవుతున్న వేళ పాకిస్థాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులను ఈ వీడియో చాటుతోందని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment