ఇందిరమ్మ ఇళ్లు ,రాజీవ్ యువ వికాస్ , కొత్త ఆసరా పెన్షన్ లు వెంటనే అమలు చేయాలని డిమాండ్
బిజెపి మండలాధ్యక్షుడు బిజెపి శ్రేణుల ధర్నా
కరీంనగర్ ఆగస్టు 23 ప్రశ్న ఆయుధం
ఇందిరమ్మ ఇళ్లు రాజీవ్ యువ వికాస్ కొత్త ఆసరా పెన్షన్ లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రోజున కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి రూరల్ బిజెపి మండల శాఖ అధ్యక్షుడు కుంట తిరుపతి స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద బిజెపి శ్రేణులతో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి కుంట తిరుపతి మాట్లాడుతూ మోస పూరిత హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిందని నిరుపేదలను కాంగ్రెస్ సర్కార్ తీవ్రంగా మోసం చేసిందన్నారు. నిరుపేదల పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్పందించి అర్హులైన ప్రతీ పేదవారికి ఇందిరమ్మ గృహం, దరఖాస్తు చేసుకున్న నిరుద్యగులందరికీ రాజీవ్ యువవికాస్ లబ్ది చేకూర్చాలన్నారు. వితంతువులు , వికలాంగులు కొత్త పెన్షన్ లు మంజూరు కోసం నిరీక్షి స్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షాన ప్రజలను మమేకం చేసి ఉద్యమించడానికి బిజెపి సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ వేముల అనిల్ కుమార్, మాజీ మండల అధ్యక్షుడు కడార్ల రతన్ కుమార్, సీనియర్ నాయకులు జవ్వాజి రమేష్ ,సోమినేని కర్ణాకర్ బోనాల నరేష్ కడారి శ్రీనివాస్ ,పోర్తి అనిల్ కట్ల శ్రీనివాస్ బైరెడ్డి వంశీ మెరుగు మల్లేశం బోయినీ మహేందర్ ఉప్పు ప్రశాంత్ ఆరే నరేష్ చిన్నబోయిన శ్రీనివాస్, సంపత్ చారి, జిందం సుకుమార్, బోనాల అంజన్న నార్ల రాములు కట్ల వెంకటేష్ తదితరులతోపాటు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు