ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి..
-సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ డిమాండ్
కామారెడ్డి జిల్లా గాంధారి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 11:
గాంధారి మండల కేంద్రంలో జరిగిన సిపిఎం పార్టీ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేకమందికి పేదలకు ఇండ్లు లేవని ఇళ్లస్థలాలు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని లేనిచో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసాను వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఎగరాకు 7500 చొప్పున ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే రైతు భరోసా జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గాంధారి శాఖ కార్యదర్శి గా సరాఫ్ కిసాన్ రావు ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కమ్మరి సాయిలు మధు రాములు, ట్విట్టర్ రాములు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.