*అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు*
*కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పుల సాంబశివరెడ్డి*
*జమ్మికుంట జూన్ 27 ప్రశ్న ఆయుధం*
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఎవరు కూడా అధైర్య పడవద్దని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పుల సాంబశివరెడ్డి అన్నారు. జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన చౌదరి కనుకమ్మ లింగయ్య దంపతులకు తెలంగాణ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ముగ్గు పోసే కార్యక్రమాన్ని శుక్రవారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మడిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పుల సాంబశివరెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల హయాంలో ఏ ఒక్క పేద ప్రజానీకానికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని అప్పటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నాడని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంవత్సర కాలంలోనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని హుజురాబాద్ నియోజకవర్గం కూడా 3500 ఇండ్లును కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు మంత్రుల ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు అనుగుణంగా హుజురాబాద్ నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేయించాడని ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు కు ఉప్పుల సాంబశివరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు చౌదరి కనకమ్మ లింగయ్య జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తోట స్వప్న కాంగ్రెస్ పార్టీ మడిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పల సాంబశివరెడ్డి మడిపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ కాయిత లింగారెడ్డి లను శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తోట స్వప్న మడిపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ కాయిత లింగారెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులు అంజి తదితరులు పాల్గొన్నారు.