విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాసిరకం కూరలు

*విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాసిరకం కూరలు*

*మధ్యాహ్నం భోజనం నిర్వాహకులపై చర్యలు- తాసిల్దార్ రాణి ఎంఈఓ రాముల నాయక్*

*మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగించి కొత్తవారికి అవకాశం*

*జమ్మికుంట /ఇల్లందకుంట జూన్ 24 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా అపర భద్రాద్రి ఇల్లందకుంట మండల కేంద్రంలోని స్థానిక జడ్పీ హైస్కూల్ లో చదువుల సంగతి పక్కన పెడితే మధ్యాహ్న భోజనాన్ని కారం మెతుకులతో విద్యార్థులకు పెట్టడం సర్వత్రా చర్చ నీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న మండల ఉన్నతాధికారులు సిపిఎం సిపిఐ మండల కార్యదర్శి రాములు రత్నాకర్ విద్యార్థి సంఘ నాయకులు అనిల్ కౌశిక్ లు మంగళవారం రోజున జడ్పీ హైస్కూల్ను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకుల పైన చర్యలు తీసుకోవాలని సిపిఎం సిపిఐ విద్యార్థి నాయకులు మండల ఉన్నతాధికారులకు తెలిపారు స్పందించిన తాసిల్దార్ మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగించడానికి మండల విద్యాధికారి రాముల నాయక్ కు తాసిల్దార్ రాణి ఆదేశించారు తాసిల్దార్ మాట్లాడుతూ గతంలో కూడా మధ్యాహ్న భోజన నిర్వాహకులుకు మధ్యాహ్న భోజనం పై వార్నింగ్ ఇచ్చిన వారి తీరు మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసి మధ్యాహ్న భోజన కార్మికుల ను తొలగించారు

తక్షణమే వారిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఎంఈఓ రాములు నాయక్ ను ఆదేశించారు. సిపిఎం సిపిఐ మండల కార్యదర్శులు రాము, రత్నాకర్, విద్యార్థి సంఘం నాయకులు అనిల్, కౌశిక్ లు విద్యార్థులకు నాసిరకం భోజనం అందించడం పట్ల ఉపాధ్యాయులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment