గ్రామ స్వరాజ్యం సాధనకు గ్రామ సభలతో శ్రీకారం..
గ్రామ స్వరాజ్ కై ఆంధ్రప్రదేశ్ ముందడుగు..
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆవిష్కారమయ్యేలా గ్రామ సభలు..
చిత్రేనిపల్లె గ్రామసభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రుద్రవరం మండలం తాసిల్దార్ జీ.వీ మల్లికార్జున రావు, ఆళ్లగడ్డ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య. చిత్రేనిపల్లె గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ, సచివాలయం సిబ్బంది, ప్రభుత్వ టీచర్లు, గ్రామ ప్రజల సమక్షంలో చిత్రేనిపల్లె, ముకుందాపురం గ్రామాల్లోని సమస్యల గురించి, అభివృద్ధి గురించి చర్చించి, 20 తీర్మానాలను ఆమోదించడం జరిగింది. గ్రామ సభ ద్వారా ఉపాధి హామీ పనులకు ఆమోదం తెలిపారు. 2023 -24 పంచాయతీరాజ్ శాఖ సంబంధించి నిధులు, అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది. అనంతరం మైలేరి మల్లయ్య మాట్లాడుతూ గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారని, మహాత్మా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి తమ వంతు అందరు బాధ్యతగా పనిచేయాలని, పల్లెటూర్లో దేశానికి పట్టుకొమ్మలని, గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు గ్రామస్తులు కూడా సహకరించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు సార్వత్రిక ఎలక్షన్లో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున వాటిని నెరవేస్తున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో గుండా పెద్ద నరసింహ, అంగా రామలింగం, దొడ్డి నరసయ్య, పగడాల సుబ్బారావు, మల్లికే చిన్నయ్య, జవాజి నడిపి మాధవ, గోపు సుబ్బారావు, నరేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.