*దళిత బంధు జాయింట్ యాక్షన్ కమిటీ (జే ఏ సి) కన్వీనర్ గా ఇంజం వెంకటస్వామి*
*హుజరాబాద్ మే 6 ప్రశ్న ఆయుధం*
హుజురాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి దళిత బంధు పైలట్ ప్రాజెక్టు పెండింగ్ నిధులు మంజూరు చేయాలని ఈ సంవత్సరం జనవరి 28 న ప్రభుత్వం అధికారికంగా సర్కులర్ జారీ చేసినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ పథకాన్ని అమలు కాకుండా లబ్ధిదారులకు అందజేయకుండా కాలయాపన చేస్తున్నారని దళిత బందు బాధితులు మండి పడ్డారు హుజురాబాద్ నియోజకవర్గం లో ఉన్న రెండో విడత లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టడానికి ఏకగ్రీవంగా దళిత బంద్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గా ఇంజన్ వెంకట్ స్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కమిటీలో కో – కన్వీనర్లుగా రేణికుంట్ల సాగర్ అంబాల ప్రభాకర్ రామంచ భరత్ అంబాల మధునయ్య గుండ్ల గణపతి దళిత బంధు లబ్దిదారుల ఆయా మండలాల ఇన్చార్జిలుగా కో కన్వీనర్లు
మహంకాళి రమేష్ – వీణవంక మోరె శేఖర్ – జమ్మికుంట, రామంచ రాకేష్ ఇల్లందకుంట కోడెపాక రక్షిత్ – జమ్మికుంట,
గాజుల కుమార్ – వీణవంక బోగం మురళి – ఇల్లందకుంట,
గంగారపు ప్రవీణ్ – జమ్మికుంట అంబాల శంతన్ హుజురాబాద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు