స్ఫూర్తినిచ్చిన సండే బ్రిక్స్ ఛాలెంజ్ ఐక్యతతో విజయవంతం

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 22 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రగతి మైదానంలో నిర్వహించిన సండే బ్రిక్స్ ఛాలెంజ్ విజయవంతంగా సాగింది. యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషంగా నిలిచింది.
బ్రిక్స్ ఛాంపియన్ కొరకు పోటా పోటీగా ముందుకొచ్చిన యువత
వారి ఉత్సాహంతో అందరినీ ఛాంపియన్స్ గా గుర్తించిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్ఈ సెషన్‌ ప్రారంభానికి ముందే పోటీకి అవసరమైన మిషన్లు,మట్టి, ఇసుక, సిమెంట్,నీరు,నీడ, తాగునీటి ఏర్పాట్లతో సహా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేయబడ్డాయి. పోటీలో పాల్గొనేవారికి అవీ సులభంగా అందేలా ప్లాన్ చేయడమైంది.
విద్యాశాఖ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా క్రమబద్ధంగా చేపట్టబడింది. ఫారమ్ నింపడం,సమూహాలుగా విభజించడం మొదలైన ప్రక్రియలు సజావుగా సాగాయి.
ఆరుగురు చొప్పున గుంపులు ఏర్పడి,ఏడు మిషన్లపై 168 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. ఒక్కో మిషన్ దగ్గర ఒక డిపిఎం ఉద్యోగిని ఇన్‌చార్జ్‌గా నియమించి వారిని మార్గనిర్దేశనం చేస్తూ,సాంకేతిక సహకారం అందించారు.వారు తమ జట్లను ప్రోత్సహిస్తూ, మిశ్రమం తయారీ, బ్రిక్స్ రూపొందించడంలో సహకరించారు.ఇది ప్రతి బృందంలోని సభ్యుల్లో టీం వర్క్, ఐక్యత, ఉత్సాహాన్ని పెంచింది.
ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రతి మిషన్ వద్దకు వెళ్లి స్వయంగా పరిశీలిస్తూ ఎలా చేస్తున్నారు? ఇంకా మెరుగుగా ఎలా చేయాలో సూచనలు ఇచ్చారు.ప్రాక్టికల్‌గా కూడా పాల్గొని,యువతలో మరింత స్పూర్తిని నింపారు.దీనికి బెంగుళూరు నుంచి వచ్చిన జి ఎస్ ఇ బి నిపుణులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించారు.
చివరగా పోటీలో పాల్గొన్న వారందరినీ విజేతలుగా ప్రకటిస్తూ టీ షర్ట్లు మరియు క్యాప్‌లు కలెక్టర్ అందజేశారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల పాల్గొన్న ప్రతి ఒక్కరు ఆనందాన్ని సంతృప్తిని వ్యక్తం చేశారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులూ వర్క్‌షాప్‌లో నైపుణ్యాలను ఆకళింపు చేసుకున్నారు.రెండవ సెషన్‌లో జిల్లాలోని ప్రభుత్వ శాఖల నుండి సుమారు 300 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మెప్మా బృందాలు, ఐకెపి సీసీలు, ఏపీఎంఎస్ సభ్యులు పాల్గొన్నారు.బెంగళూరుకు చెందిన సాంకేతిక నిపుణుడు సుధాకర్ రెడ్డి గారు వివిధ రకాల మట్టికి తగిన నిష్పత్తిలో ఇసుక, సిమెంట్, సున్నం, నీరు కలపడం ఎలా అన్న విషయాన్ని సవివరంగా వివరిస్తూ ప్రత్యేకంగా జిల్లాలో లభించే మట్టులకు ఏ మోతాదులు సరిపోతాయో వివరించారు.వారు ప్రతి సందేహానికి సున్నితంగా, ఆచరణాత్మకంగా సమాధానాలు అందించారు.ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఈ టెక్నిక్‌ను అర్థం చేసుకుని, స్వయంగా మిశ్రమం తయారు చేసి బ్రిక్స్ తయారుచేయడం ద్వారా నైపుణ్యం సాధించారు. వారు కూడా ప్రాక్టికల్ గా బ్రిక్స్ తయారు చేసి వారి సందేహాలను ప్రాక్టికల్ గా తీర్చుకోవడం వలన జిల్లాలోని ప్రతి ప్రాంతంలో అవగాహన కల్పించడంలో ఎంతో ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు.ఈ సెషన్‌లోనూ కలెక్టర్ ప్రతి మిషన్ వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ప్రోత్సహించారు.అనంతరం ఈ రెండు సెషన్లు పూర్తిగా విజయవంతంగా పూర్తి కావడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లా అధికారులు, విద్యాశాఖ,డి ఆర్ డి ఏ మెప్మా బృందాలు, మున్సిపాలిటీ సిబ్బంది, ఉద్యోగులు మరియు స్వయం సహాయక బృందాల ఐక్యత, సమన్వయం వలన ఈ వినూత్న కార్యక్రమం ప్రజలలో నూతన శక్తిని నింపిందని అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన అవగాహనతో పాఠశాలల ప్రహరీ గోడలు, వంటగదులు, మూత్రశాలలు వంటి అవసరాలను తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితంగా తీర్చవచ్చని స్పష్టంచేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment