సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు కాంట్రాక్ట్ వర్కర్లకు భీమా పథకం విస్తరింప చేయాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

ఐ ఎఫ్ టి యు నాయకులు మంగీలాల్ విజ్ఞప్తి సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు కాంట్రాక్ట్ వర్కర్లకు ఓబి వర్కర్లకు ఇటీవల సింగరేణి యాజమాన్యం ప్రైవేట్ బ్యాంకులతో ఒప్పందం చేసుకుని అమల్లోకి తెచ్చిన ప్రమాద భీమా పథకం బయట ప్రమాదాలకు సహజ మరణాలకు అంగ వైకల్యానికి కూడా విస్తరింప చేయాలని ఐ ఎఫ్ టి యు మణుగూరు ఏరియా నాయకులు అంగోత్ మంగీలాల్ సింగరేణి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక జిఎం కార్యాలయ ప్రైవేట్ సెక్యూరిటీ అడ్డా వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రవేట్ బ్యాంక్ ల వారితో మాట్లాడి సింగరేణి పొరుగు సేవల వర్కర్లకు అమలులోకి తెచ్చిన ముప్పయి లక్షల ప్రమాద భీమా పథకం బయట ప్రమాదాలతో పాటు సహజ మరణాలకు అంగ వైకల్యానికి కూడా వర్తింప చేసే విధంగా విస్తరింప చేయాలని కోరారు. విధి నిర్వహణలో కాకుండా బయట ప్రమాదాలకు సహజ మరణాలకు ఎలాంటి బీమా పథకాలు అమలులో లేకపోవడంతో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ పొడుపు గంటి రమేష్ కుటుంబం అనాధలుగా మిగిలిపోయారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.ఇంటి యజమాని ఉన్నంతవరకు కష్టమో సుఖము కుటుంబాన్ని పోషిస్తారని దురదృష్టవశాత్తు అతనికి ఏదైనా జరిగితే వారి మీదే ఆధారపడి జీవిస్తున్న కుటుంబం అనాధలుగా మిగిలిపోతారని అన్నారు.రమేష్ కుటుంబాన్ని సింగరేణి యాజమాన్యం,ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్ రామ్ అవతార్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు యగ్గడి ప్రభాకర్,పి వీరబాబు, డి వంశీ, యు రమేష్ ,కే శేఖర్ బాబు, ఎన్ సుధాకర్ ,వంశి,పి రవి,డి వీరబాబు,యు రమేష్, కే శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now