*అంతర్ జిల్లా దొంగ అల్లెపు కృష్ణ అరెస్ట్*
*3.5 తులాల బంగారం స్వాధీనం*
*హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి*
*జమ్మికుంట ఏప్రిల్ 18 ప్రశ్న ఆయుధం*
అంతర్ జిల్లా దొంగ అల్లపు కృష్ణను ఆరెస్ట్ చేసినట్లు హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి తెలిపారు జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ ఈనెల15న ఉదయం సుమారు 09:00 గంటలకు అల్లెపురెడ్డి కమలమ్మ భర్త కొమురెడ్డి కలిసి తనకు ఆరోగ్యం బాగోలేనందున జమ్మికుంటలోని వరుణ్ సాయి ఆసుపత్రికి వెళ్ళిగా ఆసుపత్రిలో డాక్టర్ లేనందున తను, తన భర్త ఇద్దరు కలిసి ఇంట్లో సామాన్లు తీసుకుందామని కొండూరి. కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మెట్ల మీద కూర్చున్నారనీ తెలిపారు. వీరు కూర్చున్న వద్దకు అల్లెపు కృష్ణ సిద్దిపేట జిల్లా వడ్డెర కాలనీ అను అతను అమ్మ నేను కనపర్తి కార్యదర్శిని మీ ఇద్దరికి రూ4000 పెన్షన్ పెట్టిస్తా, మీ ఇద్దరివి ఆధార్ కార్డ్స్ జిరాక్స్లు కావాలని నమ్మ పలికాడు ఉదయం పూట మీ ఇంటకి వెళ్తే మీరు ఎవరు లేరని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కనబడ్డారని అన్నాడనీ తెలిపారు. అతని మాటలు నమ్మి అతని భార్యని అక్కడ కూర్చోపెట్టి ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకురావడానికి వెళ్ళినాడు.తన భర్త వెళ్లినాక అల్లెపు కృష్ణ ఐసిఐసిఐ బ్యాంకు ముందు తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చొబెట్టి, అమ్మ నీ ఫోటో తీయాలనీ ఒంటి మీద బంగారం ఉండకూడదని మాయమాటలు చెప్పి తనని మోసగించి తన మెడలో ఉన్న బంగారపు పుస్తెలతాడు గొలుసు తీసుకుని, రేషన్ కార్డు పత్రాల కోసం 40 రూపాయలు ఇచ్చి మళ్ళి వస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడనీ ఏసీపీ శ్రీనివాస్ జీ తెలిపారు. బంగారం విలువ సుమారుగా రూ80,000/-ఉంటుందనీ బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరి మహిళలు , వృద్ధులు ఇలా పెన్షన్ ఇస్తా అంటే నమ్మకూడదని అలాగే తెలియని వారితో తమ వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని అనుమానితుల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, వృద్ధాప్య తల్లిదండ్రుల పిల్లలు తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు నిందితుడైన అల్లెపుకృష్ణ అను అతనిని జమ్మికుంట సీఐ వరగంటి రవి కానిస్టేబుళ్ళు ఎన్ మోహన్ ,జి సదయ్య ,పీసీలు అబ్దుల్ ఖదీర్ వి శ్రీకాంత్ 36 గంటలలో పట్టుకోవడం జరిగిందనీ తెలిపారు.ఇతనిపై జమ్మికుంటలో 3 కేసులు,హుజురాబాద్ లో 3కేసులు, కరీంనగర్లో 10 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా 85 కేసులు, ఇతను గతంలో రెండుసార్లు పిడి యాక్ట్ కింద నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినాడని ఏసీబీ శ్రీనివాస్ జి తెలియజేశారు.
అల్లెపు కృష్ణ ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామం యొక్క మహిళలతో ఆ గ్రామం యొక్క పంచాయతీ కార్యదర్శి అని చెప్పి వారికి పెన్షన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వారి దగ్గర నుండి మంగళసూత్రం నల్లపూసలు లాంటి బంగారు వస్తువులు ఫోటో కి అడ్డు వస్తాయని చెప్పి మళ్లీ ఇస్తానని తన దగ్గర ఉంచుకొని అక్కడ నుండి వెళ్లిపోతాడనీ ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు మీ వద్దకు వచ్చి మీకు పింఛన్ ఇప్పిస్తాను లేదంటే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇస్తాను అంటే నమ్మి మీ దగ్గర వస్తువులు ఎవరికి ఇవ్వకూడదని తెలిపారు.