సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాల సంగారెడ్డిలో సామాజిక శాస్త్ర విభాగాలు, ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రత్న ప్రసాద్ తెలిపారు. గురువారం మాట్లాడుతూ.. ప్రపంచంలో ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పేదరికమని ఈ పేదరికానికి అనేక కారణాలు దోహద పడుతున్నాయని ఈ పేదరికాన్ని నిర్మూలించి అందరికీ సమాన అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అనేక దేశాలు పేదరిక సమస్యతో నేటికీ అభివృద్ధిని సాధించటం లేదని పేదరికం అనేది ఒక సామాజిక సమస్యని దీనిని నిర్మూలించడానికి ప్రభుత్వాలు నిరంతరంగా కృషి చేయాలని ఈ పేదరికంపై అవగాహన కల్పించుటకు ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 17వ తేదీని అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం గా ప్రకటించినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు, సామాజిక శాస్త్ర విభాగాల అధిపతులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
తారా కళాశాలలో అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం
Published On: October 17, 2024 7:30 pm
