*ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు*
*యోగతో మానసిక శారీరక ఆరోగ్యాలను పొందుతాం*
*జమ్మికుంట జూన్ 21 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ& పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ అధ్యక్షతన ఎన్ ఎస్ ఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు పట్టణానికి చెందిన యోగా గురువు కోడిగూటి మొగిలయ్య హాజరై కళాశాల విద్యార్థులకు, అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి యోగ ఆసనాలను చేయించారు. వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ యోగ చెయ్యడం వలన ఆరోగ్యంగా ఉంటామన్నారు. నిత్య జీవితంలో యోగ చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం పొందుతామని , ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు అనంతరం యోగా గురువు మొగిలయ్యను కళాశాల అధ్యాపకుల సిబ్బంది శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్- ప్రిన్సిపాల్ డా. ఓదెలు కుమార్, అకాడమిక్ కో అర్డినేటర్ డా. కె. రాజేంద్రం, డా. కె.గణేష్, వి.కిరణ్ కుమార్, డా.రవి, ఎల్. రవిందర్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.