*పిలాయిపల్లిలో ఎరుకల నాంచారమ్మ జాతర వైభవంగా – పత్రికా ఆవిష్కరణ*
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం మే 8
పిలాయిపల్లిలో మే 10, 11, 12 తేదీల్లో జరగనున్న ఎరుకల నాంచారమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం నాగారం మున్సిపల్ రాంపల్లిలోని మల్లన్న గుడి వద్ద జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
నాగారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కావడి నరసింహ, సదానందం మరియు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రత్యేకంగా పాల్గొన్నారు. అమ్మవారి జాతర విశిష్టతను, కార్యక్రమాలను తెలియజేసే పత్రికను వారు ఆవిష్కరించారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అమ్మవారి దర్శనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, భక్తులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.