*ఈనెల 15 నుంచి ఐపీఎల్ ❓*
హైదరాబాద్:మే 11
భారత్- పాక్ మధ్య యుద్ధంతో ఐపీఎల్కు తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పం దంతో వీలైనంత తొందరగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లను ముగించాలని బీసీసీఐ ఆలోచనలో ఉంది.
ఈ వారాంతంలో టోర్న మెంట్ మళ్లీ స్టార్ట్ కావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మే 15వ తేదీ నుంచే మ్యాచ్లు జరిగే ఛాన్స్ ఉంది. అసలు షెడ్యూల్ ప్రకారం మే 25లోపే లీగ్ను ముగించాలని బీసీసీఐ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. ఇక, ఐపీఎల్ కొనసాగింపుపై నేడు ప్రత్యేక భేటీ నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలియజేశారు.
ఇక, ఐపీఎల్–2025 లీగ్ దశలో మొత్తం 57 మ్యాచ్ లు కంప్లీట్ అయ్యాయి. ధర్మశాల వేదికగా పంజాబ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న 58వ మ్యాచ్ను అర్ధాంత రంగా నిలిపివేసింది.. దీంతో ఈ మ్యాచ్ ను మళ్లీ నిర్వహించాలా లేదంటే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించాలా అనే దానిపై గవర్నింగ్ కౌన్సిల్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
లీగ్ దశలో మరో 12 మ్యాచ్లతో పాటు 4 ప్లే ఆఫ్స్ కలిపి మొత్తం 16 మ్యాచ్లు జరగాల్సి ఉంది. ముందు అనుకున్నట్లు గానే..దక్షిణాదిలో సురక్షి తమైన స్టేడియాల్లో మ్యాచ్ లు జరపాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించి నట్లు తెలుస్తుంది.
దీని కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను సెలక్ట్ చేశారు. అయితే, షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లో ఎలాగూ రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంటుంది. వీటీతో పాటు ఈ మూడు స్టేడియాల్లో మిగతా మ్యాచ్ లు జరిగే అవకాశం పుష్కలంగా ఉన్నాయి.
దీంతో ఇప్పటికే స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లను తిరిగి భారత్ కు రప్పించడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీలు, నిర్వాహకు లకు పెద్ద సమస్యగా మారింది. కాగా, ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ జట్లకు చెందిన ప్లేయర్స్ ను, ఇతర సిబ్బందిని వెనక్కి వచ్చే ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సమాచారం అందజేసింది.