ఇరిగేషన్ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే సహించం మంత్రి తుమ్మల

ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 4 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి 

భద్రాచలం పట్టణంలోని ప్రజలు మరియు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను మరియు రవాణా మార్గానికి ఇబ్బందులు లేకుండా కొత్తగా చేపడుతున్న కరకట్ట పనుల నిర్మాణములో అలసత్వం వహిస్తున్నందుకు సంబంధిత ఇరిగేషన్ శాఖ ఎస్సీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత ఎస్సీలకు ఆదేశించారు. శుక్రవారం నాడు సుభాష్ నగర్ కూనవరం రోడ్డులోని కొత్తగా నిర్మాణం చేపడుతున్న స్లూయిస్ పనులను ఆయన పరిశీలించారు. సంవత్సర కాలం నుండి పనులు సరిగా జరగడం లేదని జరగకపోవడానికి కారణం తెలపాలని ఎస్సీలపై ఆయన మండిపడుతూ మే 31 నాటికి కంప్లీట్ కావాలని, ఈసారి గోదావరి వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రాంతాల ప్రజలు కానీ భద్రాచలం పట్టణం ప్రజలు కానీ ఎవరు ఇబ్బందులు పడకూడదని అందుకు సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని అన్నారు. పాత కరకట్ట స్లుయిస్ పాయింట్ నుండి ఇప్పుడు నిర్మాణం జరిగే కరకట్టవరకు ఎత్తు పెంచాలని అలాగే పర్మనెంట్ గా మోటార్లు బిగించాలని ఆటోమేటిక్ సెటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. కరకట్ట నిర్మాణం పనులకు ఏమైనా అడ్డంకులు ఉంటే శ్రీరామనవమి కాగానే జిల్లా కలెక్టర్ ను సంప్రదించి సమస్య పరిష్కరించుకొని వెంటనే పనులు ప్రారంభించాలని, నిర్లక్ష్యం వహించే ఎస్సీలు డీఈలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదేం వీరయ్య, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఇరిగేషన్ మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now