Site icon PRASHNA AYUDHAM

ఇస్నాపూర్ మార్కెట్ తైబజార్ టెండర్లను రద్దు చేయాలి: హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

IMG 20250628 193642

Oplus_0

సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇస్నాపూర్ మున్సిపల్ మార్కెట్ కు నిర్వహించిన తైబజార్ టెండర్లను రద్దు చేసి తిరిగి వేలం నిర్వహించాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్, డప్పు అరవింద్ లు ఇస్నాపూర్ మున్సిపల్ కమీషనర్ శ్రీహరికి వినతి పత్రం అందజేశారు. రసీదులు ఇవ్వకుండా వ్యాపారులను భయబ్రాంతులకు గురి చేస్తూ నిర్ణయించిన రుసుము కంటే అధిక మొత్తంలో టెండర్ దారులు వసూలు చేస్తున్నారని, ఇది ముమ్మాటికి తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ఉల్లంఘనే అని టెండర్లను రద్ధు చేసి తిరిగి నిర్వహించడమే కాకుండా గుత్తేదారును బ్లాక్ లిస్టులో చేర్చాలని మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. భవిషత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని, మార్కెట్ లో సూచిక బోర్డులు ఏర్పాటు చేసి నిబంధననలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాల్సిన నంబర్లను పొందు పరచాలని కోరారు. పేద మధ్య తరగతి ప్రజలు ఎక్కువ నివాసం ఉండే ఈ ప్రాంతంలో తైబజార్ అధిక వసూళ్లు చేయడం వల్ల ఈ భారం పరోక్షంగా ప్రజల పైనే పడుతుందని మెట్టు శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Exit mobile version