బీసీలను మోసం చేస్తున్న బిజెపి బంద్ లో పాల్గొనడం సిగ్గుచేటు
42 శాతం రిజర్వేషన్ల ను తొమ్మిదో షెడ్యూల్లో ఎందుకు చేర్చడం లేదు
సిపిఎం మండల కార్యదర్శి శీలం అశోక్
జమ్మికుంట అక్టోబర్ 18 ప్రశ్న ఆయుధం
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ కు బిల్లు పంపి 6 నెలలు గడుస్తున్నా బిల్లును ఆమోదించకపోవడం మూలంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, బీసీలను మోసం చేసింది ముమ్మాటికి బిజెపి పార్టీ అని సిపిఎం మండల కార్యదర్శి శీలం అశోక్ అన్నారు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక మోత్కులగూడెం చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా మీదుగా అట్లాగే గాంధీ చౌరస్తా నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి బందులో పాల్గొన్నారు అనంతరం శీలం అశోక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక వైపు బీసీ బిల్లు ఆమోదించకుండా దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు బీసీల పట్ల ముసలి కన్నీరు కారుస్తుందన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ బిల్లు పై హైకోర్టులో స్టే రావడం, సుప్రీంకోర్టులో కూడా నిరాశ గురి కావడం బలహీన వర్గాలను నిరాశపరచిందని ఆందోళన వ్యక్తం చేశారు 42 శాతం బీసీ బిల్లుని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర బీజేపీ సర్కార్ స్పందించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ఆమోదించి ప్రత్యేక ఆర్డినెన్స్ గవర్నర్కు పంపి మూడు నెలలు గడిచినా కూడా ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడంతో బీసీ రిజర్వేషన్ల బిల్లు జీవో నెంబర్ 9 ద్వారా అమలు చేయడానికి ప్రయత్నం చేసి అది నిలబడకుండా పోయిందని దీనికి పూర్తి బాధ్యత కేంద్ర బిజెపి ప్రభుత్వం వహించాలన్నారు ఇప్పటికైనా తెలంగాణలో 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు జక్కుల రమేష్ యాదవ్, దండిగారి సతీష్,వడ్లూరి కిషోర్ కుమార్,కన్నం సదానందం, సిరికొండ పోచయ్య, సల్ల కుమార్, గిరవేణి రాజు, ఎం కిరణ్, సిరికొండ మదనయ్య, సల్ల సంపత్, తదితరులు పాల్గొన్నారు.*