జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ చేయడం సరికాదు: మాజీ వైస్ చైర్మన్ జుబేర్

సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కి ప్రజలకు మోసం చేస్తుండు

బిఆర్ఎస్ నాయకులు జుబేర్

ప్రశ్న ఆయుధం 15 మార్చి ( బాన్సువాడ ప్రతినిధి )

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాస్తారోకో ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా టిఆర్ఎస్ నాయకులు జుబేర్ మాట్లాడుతూ…అసెంబ్లీలో 6 గ్యారంటీలపై 420 మోసం హామీలు ఎందుకు అమలు చేయడం లేదని గళమెత్తిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తున్నారని వారు మండిపడ్డారు.ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు మోచి గణేష్ శివసూరి ఎర్రవట్టి సాయిబాబా రమేష్ యాదవ్ మౌలా భూమేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment