ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వారావుపేట ఆర్సీ ఏప్రిల్ 2
చండ్రుగొండ మండలంలో జనవరి 29, 2024వ సంవత్సరంలో మద్దుకూరు గ్రామ సమీపంలో ఆ గ్రామానికి చెందిన నల్లమోతు రామారావు ని చండ్రుగొండకు చెందిన కంచర్ల తిరుపతి ని ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయినందున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు నష్టపరిహారంగా నల్లమోతు రామారావు కి 75,985 రూపాయలు కంచర్ల తిరుపతి కి 10,000 విలువైన చెక్కులను గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవులను పరిరక్షించే బాధ్యత మనందరిపై ఉందని ఈ వేసవికాలంలో అడవులలో నీరు దొరక్క అడవి జంతువులు వన్యప్రాణులు గ్రామ పరిసరాలలో ఉండే చెరువులు కుంటల వద్దకు వస్తుంటాయని మనం జాగ్రత్త వహిస్తూ అడవి జంతువులకు ఏ విధమైన హాని చేయకూడదని సూచించారు అడవి జంతువులను వేటాడితే కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు. అలాగే అడవి జంతువుల వేట కోసం విద్యుత్తును అమర్చితే అనుకోని ప్రమాదాలు సంభవిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని సూచించారు ఎట్టి పరిస్థితులలో అడవ జంతువులను వేటాడ వద్దన్నారు అడవులకు నిప్పు పెట్టడం వలన ఎన్నో చిన్న చిన్న నిరాశ్రయం కోల్పోతాయని మానవతా దృక్పథంతో ఆలోచించి అడవులను పరిరక్షించే బాధ్యత మనందరిని సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సిహెచ్ ఎల్లయ్య,సెక్షన్ ఆఫీసర్ ఎస్ ఎల్ అమరేందర్ సింగ్, బీట్ ఆఫీసర్స్ బి భాస్కర్, ఎం రామకృష్ణ, బి స్వాతి ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.