రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడడం శోచనీయం..!!,

IMG 20240912 140514

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాహుల్ గాంధీ భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆర్థిక వ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం శోచనీయమని బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలుకూరి రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పోచారం రాములు అన్నారు. గురువారం జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సూచన మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ డౌన్ డౌన్ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలను దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం కొలుకూరి రాజశేఖర్ రెడ్డి, పోచారం రాములు మాట్లాడుతూ.. గత 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో దేశంలో మత, కుల రాజకీయాలు చేస్తూ దేశం అభివృద్ధి నోచుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గత 60 సంవత్సరాలు పాలించి దేశాన్ని సర్వనాశనం చేశారని తెలిపారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆర్థిక వ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం శోచనీయమని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. విదేశాలకు వెళ్లి దేశ ప్రతిష్టను భంగపరిచే విధంగా మాట్లాడిన రాహుల్ గాంధీని దేశ ప్రజలు ఒక దేశద్రోహిగా పరుగనిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్లు మందుల నాగరాజు, కసిని వాసు, ద్వారకా రవి, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్, శివంగుల నాగరాజ్, శ్రీనివాస్, అనిత, గోవింద, బాబా చారి, సదానంద చారి, శ్రీపతిరావు, మీనా గౌడ్, తేజస్విని, లక్ష్మి, రాజు, సాయి రెడ్డి, ప్రభాస్, గాజుల అనిల్, అజయ్, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now