అంత వేగంలోనూ రైల్లో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం.

దేశంలో మొట్టమొదటిసారిగా వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రైల్వేశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది

ఇందులోభాగంగానే రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు

ఈపరీక్షల్లో రైలు గరిష్ఠంగా గంటకు 180కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఓ వీడియోను షేర్‌ చేశారు.

అందులో వందే భారత్‌ స్లీపర్‌ రైలు 180 kmph వేగంతో రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లింది.

అంత వేగంలోనూ రైల్లో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ సూచనల మేరకు రాజస్థాన్‌లోని కోటా రైల్వే డివిజన్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు.

Join WhatsApp

Join Now