Site icon PRASHNA AYUDHAM

గద్దర్ అన్నకు పద్మశ్రీ అవార్డును తిరస్కరించడం అత్యంత అన్యాయం

IMG 20250130 WA0273

మద్దెల ఖండించారు

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న పద్మశ్రీ అవార్డు తిరస్కరించడానికి ఖండించారు.
తన పదునైన కలాన్ని,వాడి అయిన గళాన్ని ఆయుధంగా మలచి పీడిత తాడిత ప్రజల, కార్మిక కర్షక సంక్షేమం కోసం, సామాజిక చైతన్యం కోసం,
భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జ కట్టి, కదం తొక్కి పదం పాడి,
పల్లె పల్లె వాడ వాడ తిరిగి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, చైతన్యాన్ని రగిలించి, తన కలంతో గళంతో పాడిన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అనే గీతంతో, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలా తీసుకెళ్లి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాధనలో భాగస్వామి అయిన ప్రముఖ ప్రజాకవి గాయకుడు , ప్రజా యుద్ధనౌక స్వర్గీయ గద్దర్ అన్నకు, పద్మశ్రీ అవార్డును మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తే, ప్రతిపాదనను తుంగలో తొక్కి గంగలో కలిపిన, కేంద్ర ప్రభుత్వం యొక్క పక్షపాత ధోరణి ఎంతో అన్యాయమని అమానుషమని ఖండించారు. గద్దర్ అన్న పద్మశ్రీ అవార్డును తిరస్కరించడం ఆటవికమని అరాచకమని అది యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా,కళామతల్లిని అవమానపరచడం అని
భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీగీత రచయిత గాయకులు, సమాజ సేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.

Exit mobile version