*వయనాడు వరద బాధితులను ఆదుకొని
జాతీయ విపత్తుగా ప్రకటించాలి*
*బాధితుల కోసం జమ్మికుంటలో విరాళాల సేకరణ*
*సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 3*
కేరళ రాష్ట్రంలోని వయనాడులో సోమవారం అర్ధరాత్రి వర్షం చేసిన ప్రళయ తడవానికి ఊళ్ళకు ఊర్లు స్మశానాలు అయ్యాయని కొండలు అమాంతం వచ్చి ఇళ్లను కబళించాయని వందలాదిమంది చనిపోయారని ఈ విపత్తు నుండి క్షతగాత్రులను ప్రజలను కాపాడాలని బాధితులను అన్ని విధాల ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు శనివారం రోజున కేరళ వరద బాధితుల సహాయార్థం జమ్మికుంట మున్సిపాలిటీ లో విరాళాల సేకరించి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ జడివానకు ముంచెత్తిన వరదలకు తోడు కొండ చారియలు విరిగిపడి కేరళ రాష్ట్రం వాయనాడు జిల్లా బిక్కుబిక్కుమంటూ వనిగిపోయిందని ఇప్పటివరకు 300 మంది మరణించారని అనేకమంది గల్లంతయ్యారని సహాయక చర్యలు అక్కడి ప్రభుత్వం ముమ్మరం చేసిందని గుర్తు చేశారు 50 శిబిరాల్లో 10000 మంది బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు ఇలాంటి విపత్తు సంభవించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతనుండి తప్పుకొని రాజకీయాలు మాట్లాడడం సరికాదని యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ప్రకృతి విలయం మాటలకందని మహా విషాదమని వందలాది మంది నిద్రలోనే సమాధి అయ్యారని మరెందరో గల్లంతయ్యారని వందల ఇల్లు పేక మేడల కూలిపోయాయని శిథిలాల కింద ఉండి వినిపించే ఆర్తనాదాలు హృదయాన్ని మెలివేస్తున్నాయని మరణ భూమిని తలపిస్తున్న వయనాడు లోని గ్రామాల్లో సైన్యం బాధితులకు బాసటగా నిలిచిందన్నారు రాజకీయాలు పక్కన పెట్టి జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం ఉదారంగా సహాయం చేయాలని వాసుదేవరెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్ నాయకులు జక్కుల రమేష్ చెల్పూరి రాములు జక్కుల రమేష్ వడ్లూరి కిషోర్ కన్నం సదానందం సిరికొండ పోచయ్య చల్ల సంపత్ ప్రశాంత్ రాజేందర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.