ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 12 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
వసతి గృహాలు,పోస్ట్ మెట్రిక్,ఫ్రీ మెట్రిక్ ప్రారంభమైనందున విద్యార్థినీ,విద్యార్థులు సెలవులు ముగించుకొని అందరూ పాఠశాలలకు చేరుకునేలా సంబంధిత హెచ్ఎంలు వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.గురువారం కొత్తగూడెంలోని పోస్ట్ మెట్రిక్ బాలికల కళాశాల,ఫ్రీ మెట్రిక్ పాఠశాలలను సందర్శించారు. పాఠశాలల్లోని హాస్టల్ గదులు డార్మెట్రీ, డైనింగ్ హాల్, బాత్రూమ్స్,వంటగది,వసతి గృహాలలోని పరిసరాలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులు ముగించుకొని విద్యార్థినిలు అందరూ వారి వారి పాఠశాలలకు వచ్చే విధంగా సంబంధిత హెచ్ఎంలు వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి తల్లిదండ్రులకు తెలియజేసి సోమవారం నాటికి 100% పిల్లలందరూ వారి ఇన్స్టిట్యూషన్ లో ఉండాలని, పిల్లలు రాగానే వాతావరణం మార్పు వలన అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేయించాలని అన్నారు. పరిసరాల చుట్టూ శుభ్రం చేయించాలని,డ్రైనేజీలు, బాత్రూములు,అన్ని శుభ్రంగా ఉంచి పిల్లలకు సురక్షితమైన మంచినీరు సరఫరా అయ్యేలా చూడాలని, నూతన మెనూ ప్రకారం తప్పనిసరిగా వారికి ఆహారం అందించాలని, వసతి గృహాలు చాలా పురాతనంగా ఉన్నందున ఏమైనా రిపేర్లు ఉంటే వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి తనకు సమర్పించాలని అన్నారు. విద్యార్థినిలకు మాత్రము ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత వార్డెన్ పై ఉందని, వారం రోజులు పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతులను సంబంధిత ఏఎన్ఎంలు గమనిస్తూ ఉండాలని, ఎవరైనా అస్వస్థత గురి అయితే వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని అన్నారు.అనంతరం విద్యార్థినిలతో మాట్లాడుతూ వేసవి సెలవులకు సొంత ఊర్లకు వెళ్లి వచ్చినందున ప్రస్తుతం వాతావరణం మార్పు వలన అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉన్నందున ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే వార్డెన్ కు తెలియజేయాలని, చదువు పట్ల మాత్రం నిర్లక్ష్యం వహించకుండా ఇప్పటినుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భవిష్యత్తులో మీరు ఏమి కాదల్చుకున్నారో ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, పోస్ట్ మెట్రిక్, ఫ్రీ మెట్రిక్ హాస్టల్ వార్డెన్ కృష్ణవేణి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో ఐటీడీఏ పీవో పర్యవేక్షణ
