పాక్లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్ప్రెస్
పాకిస్థాన్లో బాంబు పేలుడు సంభవించింది. దీని కారణంగా అటుగా వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి పాకిస్థాన్ (Pakistan)లో రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు సంభవించింది. దీంతో అటుగా వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ (Jaffar Express) రైలు పట్టాలు తప్పింది. స్థానిక మీడియా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
బుధవారం సింధ్ ప్రావిన్స్లోని జకోబాబాద్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దీని కారణంగా మూడు అడుగుల గుంత పడిందని పోలీసులు తెలిపారు. రైలు మార్గంలో ఐఈడీ బాంబు అమర్చడం వల్ల పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు నేపథ్యంలో క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్లోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది… ఇదే రైలు మార్చిలో హైజాక్ (Train Hijack)కు గురైన సంగతి తెలిసిందే. పాక్లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు ఈ రైలును హైజాక్ చేశారు. అందులోని వందలాది మందిని బందీలుగా తీసుకొన్నారు. ఈక్రమంలో వారిని రక్షించడానికి వెళ్లిన పాక్ భద్రతాధికారును కూడా హతమార్చారు. ఆ తర్వాత పాక్ అధికారులు ఆపర