Site icon PRASHNA AYUDHAM

అన్న క్యాంటీన్ కు స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ విప్.. ఎమ్మెల్యే తోక జగదీశ్వరి  

IMG 20250618 WA2107

*అన్న క్యాంటీన్ కు స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ విప్..* ఎమ్మెల్యే తోక జగదీశ్వరి

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 18( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

కురుపాం నియోజకవర్గ కేంద్రంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు కోసం స్థలాన్ని బుధవారం నాడు ప్రభుత్వ విప్ & కురుపాం ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల కోసం వచ్చిన గిరిజనులకు మరియు ఇతర అవసరాల కోసం మండల కేంద్రానికి వచ్చిన వారికి అతి తక్కువ ధరకు భోజనం ప్రతి పేదవారికి అందడమే ప్రభుత్వ లక్ష్యమని, త్వరగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు పూర్తి చేస్తామని అన్నారు. ఆమె వెంట మండల పార్టీ అధ్యక్షులు కె కొండయ్య, నాయకులు పురుషోత్తం నాయుడు, రాంబాబు, వెంకట నాయుడు, సింహాచలం, సాయి, హౌసింగ్ పీడీ ఆర్.వంశీకృష్ణ మరియు రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Exit mobile version