Headlines in Telugu:
-
జగన్ జైలుకు వెళ్ళడమా? షర్మిల నిరసనతో ఎటువంటి పరిణామాలు?
-
“1750 కోట్లు ముడుపులు” ఆరోపణలపై షర్మిల ఏసీబీకి ఫిర్యాదు
-
“అదానీ-జగన్ అవినీతి”: అమెరికా దర్యాప్తు ఆధారాలతో షర్మిల ఆగ్రహం
-
రాష్ట్ర దర్యాప్తు సంస్థలు నిద్రపోతున్నాయా? షర్మిల పది ప్రశ్నలు
-
టీడీపీ మౌనంపై షర్మిల తీవ్ర విమర్శలు
ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ నుంచి రూ.1750 కోట్ల మేరకు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్పై ఆయన సోదరి పీసీసీ చీఫ్ షర్మిల నిరసన బాట పట్టారు. బుధవారం ఆమె ప్రకటించినట్టుగానే గురువారం ఉదయం.. జగన్పై ఏపీ ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే.. దీనికి ముందే.. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అదానీ – జగన్ రూ.1750 కోట్ల ముడుపుల పై వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆనాడు అదానీ డీల్ పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడెందుకు మౌనం పాటిస్తోందని షర్మిల ప్రశ్నించారు. అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని, సోలార్ పవర్ డీల్ లో జగన్ కి 1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడి అయ్యిందని తెలిపారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఆధారాలు కూడా బయట పెట్టాయన్నారు. విదేశాల్లోనే ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా? అని షర్మిల వ్యాఖ్యానించారు. ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదన్నారు.