అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచిన వ్యక్తికి జైలు శిక్ష..
నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి జనవరి 09
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచిన యజమానికి ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చినట్లు ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ గురువారం తెలిపారు. బాబను సాహెబ్ పహాడ్ కు చెందిన అబ్దుల్ హ ఫీ అర్ధరాత్రి వరకు టీ పాయింట్ తెరిచించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు.