పరమ శివుడికి… జలాభిషేక!.
పటాన్చెరులో భక్తి శ్రద్ధలతో సాగిన యాత్ర. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్…



ఉత్తర భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే కన్వార్ యాత్ర పటాన్చెరు పట్టణంలో సోమవారం చేపట్టారు. కాషాయ వస్త్రాలు ధరించి వారంతా కావడిలో పుణ్య జలాలను మోసుకెళ్లి స్థానికంగా ఉన్న పరమశివుడి ఆలయంలో శివ లింగానికి అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారు పాల్గొన్నారు. ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, తమ మూలాలను మరిచిపోకుండా ఈ యాత్ర కొనసాగించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. ఈ సందర్బంగా శివ నామస్మరణతో ఆ ప్రాంతమంతా అధ్యాత్మిక శోభను సంతరించుకుంది.*