రద్దయిన ట్రైన్ స్థానంలో కొత్త ట్రైన్ ను కల్పించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన జమ్మికుంట అయ్యప్ప స్వాములు

*రద్దయిన ట్రైన్ స్థానంలో కొత్త ట్రైన్ ను కల్పించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన జమ్మికుంట అయ్యప్ప స్వాములు*

*కరీంనగర్ డిసెంబర్ 24 ప్రశ్న ఆయుధం:*

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను అయ్యప్ప గురు స్వామి గడప నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం జమ్మికుంటకు చెందిన అయ్యప్ప స్వాములు బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ తో మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. జమ్మికుంట ప్రాంతానికి చెందిన సుమారు 300 మంది అయ్యప్ప స్వాములు జనవరి 5, 9 తేదీలలో శబరిమలై వెళ్లడం కొరకు మూడు నెలల క్రితం కోర్బా ఎక్స్ ప్రెస్ రైలు టికెట్లు బుక్ చేసుకోవడం జరిగిందని అనివార్య కారణాలవల్ల ట్రైన్ ను రైల్వే శాఖ రద్దు చేయడంతో అయ్యప్ప స్వాములు తీవ్ర ఆందోళనకు గురి కావడం జరిగిందని వెంటనే దాని స్థానంలో కొత్త ట్రైన్ ను కల్పించి అయ్యప్ప స్వాములు యొక్క యాత్రను సాగే విధంగా చూడాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ని కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి సంబంధిత రైల్వే అధికారులతో మాట్లాడి స్వాములకు ఇబ్బంది కలగకుండా చూడాలని తన కార్యదర్శి ఐఏఎస్ అధికారి వంశీకి చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో సుధాకర్ గురుస్వామి, మణికంఠ స్వామి, రాజశేఖర్ స్వామి, గోపి స్వామి, నిఖిల్ స్వామి, మల్లేష్ స్వామి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now