శ్రీ పార్వతిదేవి మరియు శ్రీ అభయాంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకుడు : ప్రేమ కుమార్
ప్రశ్న ఆయుధం మే19: కూకట్పల్లి ప్రతినిధి
కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ – 3, శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ శ్రీ పార్వతీ దేవి మరియు శ్రీ అభయాంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భముగా జరిగిన ప్రత్యేక పూజలలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ ప్రధాన కార్యదర్శి మండలి దయాకర్ కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు కొల్లా శంకర్, పసుపులేటి ప్రసాద్,పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.