*ఆషాడ బోనాల జాతర మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు : ప్రేమ కుమార్.*
ప్రశ్న ఆయుధం జులై22: కూకట్పల్లి ప్రతినిధి
జనసేన పార్టీ నాయకులు శివశంకర్ , ఈశ్వర్రావు ల ఆహ్వానం మేరకు కూకట్ పల్లి నియోజకవర్గం లోని శ్రీ శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి నీలం మణికంఠ దుర్గమ్మ తల్లి దేవాలయం ( ఏ వి బి పురం) అమ్మవారుల బోనాల జాతరలో జనసేన పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ప్రత్యేక పూజలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు .
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వేముల మహేష్ , పోలేబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు ,హర్షిత్ ,సాయికుమార్,వినయ్, విష్ణు, లక్కీ జయరాం తదితరులు పాల్గొన్నారు.