Site icon PRASHNA AYUDHAM

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు : ప్రేమ కుమార్

IMG 20250620 WA1920

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు : ప్రేమ కుమార్

ప్రశ్న ఆయుధం జూన్20: కూకట్‌పల్లి ప్రతినిధి

బాపట్ల జిల్లా ,రేపల్లె మండలం,వడ్డి వారి పాలెం గ్రామం లోని సావిత్రి గణేష్ జిల్లా పాఠశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో 43 సంవత్సరాల క్రితం అదే పాఠశాలలో తనతో పాటు చదివిన మిత్రులతో కలసి ఆనాటి మధుర స్మృతులను తలుచుకొని ఆనందంతో ఆలింగనాలు చేసుకున్న కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి ముమ్మా రెడ్డి ప్రేమ కుమార్.

ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతు కీర్తి శేషులు మహానటి సావిత్రి గణేష్ ఈ పాఠశాలను కట్టించారని ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉద్యోగలలొ, వ్యాపారలలొ, రాజకీయలలో మంచి విజయాలను సాధిస్తున్నారని, తాను ఈ పాఠశాలలో చదవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అని అన్నారు అనంతరం ఈ సంవత్సరం సావిత్రి పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తీర్ణులై 570 మార్కులకు కంటే ఎక్కువ వచ్చిన ప్రధమ ,ధృతీయ ,తృతీయ విద్యార్థులకు నగదు బహుమతులు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ,ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version