Site icon PRASHNA AYUDHAM

పరీక్షలు అంటే ఆందోళన వద్దు* *జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

IMG 20250209 WA0277

ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 9
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
విద్యార్థులు పరీక్షలు అంటే ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.ఆదివారం కొత్తగూడెంలోని అంబేద్కర్ భవన్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్రేరణ, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ముందుగా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థిని,విద్యార్థులు పదవ తరగతి వార్షిక పరీక్షలకు సమయం దగ్గర పడుతున్నందున కస్టపడి చదవాలని మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. పరీక్ష వ్రాసే విధానాన్ని విద్యార్థిని విద్యార్థులకు తెలపాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరీక్షల కు ప్రశాంతంగా చదువుకోవాలని, మానసికంగా ఆందోళన చెందకుండా సిద్ధపడాలని కోరారు. ఇప్పుడు ఉన్న 40 రోజుల సమయం మంచి సమయమని సబ్జెక్టు వారీగా ప్రతిరోజు రివిజన్ చేసుకోవాలని, గత సంవత్సర ప్రశ్నపత్రాలు విశ్లేషించుకోవాలని, పాఠ్యాంశాలు మరొకసారి పునఃశ్చరణ చేసుకోవాలని, అయన తెలియజేశారు. విద్యార్థినీ విద్యార్థులకు వార్షిక పరీక్షల సామాగ్రిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారిని ఇ.ఇందిర, మరియు విషయ నిపుణులు మీరా హుస్సేన్, బిఎస్ఎన్ రెడ్డి, మోహన్ రావు, సైదులు, సైకాలజీ నిపుణులు వెంకటేశ్వర బాబు, మరియు వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version