Site icon PRASHNA AYUDHAM

పోలీస్ కస్టడీకి జానీ మాస్టర్ అత్యాచార కేసులో బిగిస్తున్న ఉచ్చు.

జానీ మాస్టర్

పోలీస్ కస్టడికి జానీ మాస్టర్ అత్యాచార కేసులో బిగుస్తున్న ఉచ్చు..

 

హైదరాబాద్ బ్యూరో  

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 25: 

 

లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నీ పోలీసుల కష్టడికి అనుమతించాలని పోలీసులు కోర్టును కోరగా రంగారెడ్డి కోర్టు పోలీసులకు అనుమతించింది. దీంతో చర్లపల్లి జైల్లో ఉన్న జానీ ని నేటి నుంచి నాలుగు రోజులపాటు కష్టడికి తీసుకొని పోలీసులు ప్రశ్నించనున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే జానీ తన నేరాన్ని అంగీకరించారు అయితే కష్టడిలో జాని అఘాయిత్యాలు మరిన్ని వెలుగు చేసే అవకాశం ఉన్నందున అంతకుముందు పోలీసులు రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి. 2019లో జానితో బాధితురాలికి పరిచయం ఏర్పడింది దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నాడు. 2020లో ముంబైలో హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశాడు అప్పుడు బాధితురాలు వయసు పదహారేళ్లు నాలుగేళ్లలో బాధితురాలపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు జాని విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలని బెదిరించారు అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. యువతి ఫిర్యాదు తర్వాత అజ్ఞాతం లోకి వెళ్ళిన జానీని నాలుగు రోజుల తర్వాత గోవాలో హోటల్లో తెలంగాణ ఎస్ఓటి అదుపులోకి తీసుకుంది. గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్ కు తరలించింది ఆపై ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను చంచలగూడ జైలుకు తరలించారు. తాజాగా పోలీస్ కస్టడీ కి కోర్టు అనుమతించింది.

Exit mobile version