మహా న్యూస్ ఆఫీస్ పై దాడిని ఖండించిన జర్నలిస్టులు

మహా న్యూస్ ఆఫీస్ పై దాడిని ఖండించిన జర్నలిస్టులు

ప్రశ్న ఆయుధం 30 జూన్ ( బాన్సువాడ ప్రతినిధి)

హైదరాబాదులోని మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై దుండగులు దాడి చేయడానికి బిచ్కుంద జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.ఇందుకు నిరసన వ్యక్తం చేస్తూ తహశీల్దార్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ…కొందరు ప్రజా ప్రతినిధులు చేసిన తప్పులను నిజాయితీగా చూపిస్తున్న మహా న్యూస్ పై ఇలా దాడి చేయడం సిగ్గు చేటు అన్నారు.ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.వినతిపత్రం అందించిన వారిలో సీనియర్ జర్నలిస్టులు వీరన్న గంగాధర్,శంకర్ పటేల్, సంజు, సాయిలు,లక్ష్మణ్, సుభాష్, దయానంద్,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment