బౌద్ధ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 11

కొత్తగూడెం డివిజన్ ఆర్ సి మహాత్మ జ్యోతిబాపూలే జయంతి

వేడుకలు శుక్రవారం నాడు మణుగూరు ఏరియా బౌద్ధ అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బౌద్ధ అభిమానీ సామాజిక కార్యకర్త ఆంగోత్ మంగీలాల్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలోనే లేదా ఈ భూమి మీద మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు బుద్ధుడు అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్రలోనే మొట్ట మొదటి సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. ఈ ఆధునిక సమాజంలో పీడిత, వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన చిరస్మరణీయుడు జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు సమాజంలో మహిళల పట్ల వివక్ష, అంటరానితనం, సాంఘిక దురాచారాలకు కుల వివక్షకు వ్యతిరేకంగా 150 సంవత్సరాల క్రితమే పోరాడి అనేక విజయాలు సాధించిన జ్యోతిబాపూలే దేశంలోని పీడిత వర్గాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. ప్రతి ఒక్కరు మహనీయుల అడుగుజాడల్లో వారి ఆలోచనలతో సమాజ శ్రేయస్సుకై పాటుపడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మణుగూరు ఏరియా బౌద్ధ అభిమానులు కే గురుమూర్తి, జి నాగేశ్వరరావు వి శంకర్, కే నాగేశ్వరరావు యు శివరామకృష్ణ, ఎం సాంబయ్య, కే శ్రీను, వై శంకర్, ఎం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now